డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం
హైదరాబాదులోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం / From Wikipedia, the free encyclopedia
డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం (Dr. B.R. Ambedkar Memorial) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్మృతివనం.[1] భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరిట నిర్మించిన ఈ స్మృతివనంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.[2] భూమి నుండి 175 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.[3]
త్వరిత వాస్తవాలు ప్రదేశం, రకం ...
ప్రదేశం | ట్యాంక్బండ్, హైదరాబాదు, తెలంగాణ |
---|---|
రకం | స్మృతివనం |
నిర్మాన పదార్థం | కాంస్యం |
వెడల్పు | 45.5 అడుగులు |
ఎత్తు | 125 అడుగులు |
నిర్మాణం ప్రారంభం | 2021 ఏప్రిల్ 14 (2021-04-14) |
పూర్తయిన సంవత్సరం | 2023 |
ప్రారంభ తేదీ | 2023 ఏప్రిల్ 14 (2023-04-14) |
అంకితం చేయబడినది | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ |
మూసివేయి
2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, 50వేలమంది ప్రజల సమక్షంలో ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[4]