ఢిల్లీ దర్బారు
From Wikipedia, the free encyclopedia
ఢిల్లీ దర్బార్ అనేది భారతదేశంలో ఒక చక్రవర్తి లేదా చక్రవర్తి వారసత్వాన్ని గుర్తించడానికి ఢిల్లీలోని కారొనేషన్ పార్కు వద్ద బ్రిటిష్ వారు భారతీయ శైలిలో నిర్వహించిన సభ. దీనిని ఇంపీరియల్ దర్బార్ అని కూడా పిలుస్తారు. బ్రిటిషు సామ్రాజ్యం ఉచ్ఛ స్థితిలో ఉండగా 1877, 1903, 1911 లలో మూడు సార్లు దీన్ని నిర్వహించారు. 1911 దర్బారుకు మాత్రమే రాజు - జార్జ్ V - హాజరయ్యాడు. ఈ పదం మొఘల్ పదం దర్బార్ నుండి తీసుకున్నారు.