సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి / From Wikipedia, the free encyclopedia
సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ సత్య నాదెళ్ల ఒక భారతీయ అమెరికన్ వ్యాపార నిర్వాహకుడు. 2014 ఫిబ్రవరి 4 న స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితుడయ్యాడు.[2][3] అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇది భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం అరుదైన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పనిచేశారు. భారత ప్రభుత్వం 2021కి గాను సత్య నాదెళ్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[4]
సత్య నాదెళ్ల | |
---|---|
జననం | సత్య నారాయణ నాదెళ్ల (1967-08-19) 1967 ఆగస్టు 19 (వయసు 56) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ |
పౌరసత్వం | అమెరికన్[1] |
విద్య |
|
వృత్తి | ఛైర్మన్, , సియిఓ మైక్రోసాఫ్ట్ |
జీవిత భాగస్వామి | అనుపమ నాదెళ్ల (m. 1992) |
పిల్లలు | 3 |
పురస్కారాలు | పద్మ భూషణ్ (2022) |
సంతకం | |