సరిహద్దు భద్రతా దళం
From Wikipedia, the free encyclopedia
భారతదేశానికి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో ఉన్న సరిహద్దులను కాపలా కాసే భారత సంస్థ, సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్). భారతదేశం లోని ఐదు కేంద్ర సాయుధ పోలీసు సంస్థల్లో ఇది ఒకటి. 1965 లో పాకిస్తానుతో జరిగిన యుద్ధం ముగిసాక, 1965 డిసెంబరు 1 న, "భారతదేశ సరిహద్దులను భద్రంగా ఉంచడానికి, సరిహద్దులతో ముడిపడ్డ ఇతర విషయాల కోసమూ" ఈ సంస్థను స్థాపించారు.[4][5]
సరిహద్దు భద్రతా దళం सीमा सुरक्षा बल | |
---|---|
పొడిపదాలు | BSF |
నినాదం | జీవన పర్యంత కర్తవ్యం[1] |
Agency overview | |
ఏర్పాటు | డిసెంబరు 1, 1965 |
ఉద్యోగులు | 2,65,000 క్రియాశీలక సిబ్బంది[2] |
వార్షిక బడ్జెట్టు | ₹22,718.45 crore (US$2.8 billion) (2022–23 est.)[3] |
Legal personality | ప్రభుత్వ సంస్థ |
Jurisdictional structure | |
Federal agency | భారతదేశం |
Operations jurisdiction | భారతదేశం |
Governing body | భారత హోం మత్రిత్వ శాఖ |
Constituting instrument |
|
General nature |
|
ప్రధాన కార్యాలయం | న్యూ ఢిల్లీ |
Parent agency | హోం మంత్రిత్వ శాఖ |
Facilities | |
పడవలు | 500+ |
విమానాలుs | 24 |
జంతువులు | కుక్కలు, ఒంటెలు, గుర్రాలు |
Website | |
bsf.gov.in |
శాంతి సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ఉన్న భూ సరిహద్దును కాపాడటం, అదే సమయంలో అంతర్దేశీయ నేరాలను నిరోధించే విధులతో ఈ అర్ధసైనిక బలగాన్ని స్థాపించారు. యుద్ధసమయాల్లో ఇది వివిధ క్రియాశీల పాత్రలను నిర్వహిస్తుంది. ఇది హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. బిఎస్ఎఫ్కు సొంతంగా అధికారుల కేడర్ ఉంది. కానీ దాని అధిపతి అయిన డైరెక్టర్ జనరల్గా మాత్రం తొలినుంచీ భారత పోలీసు సేవకు చెందిన అధికారే ఉంటూ వచ్చారు.[5] 1965 లో కొద్దిపాటి బెటాలియన్లతో మొదలైన బిఎస్ఎఫ్, 2,57,363 మంది సిబ్బందితో 186 బెటాలియన్లకు వృద్ధి చెందింది. వైమానిక విభాగం, సాగర విభాగం, ఆర్టిలరీ రెజిమెంట్, కమాండో యూనిట్లు కూడా ఈ సంస్థలో భాగంగా ఉన్నాయి.[6][7] ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళం. భారత భూభాగాల రక్షణలో బిఎస్ఎఫ్ తొలి రక్షణ వలయం.[8]