ఆంధ్ర కవుల చరిత్రము
తెలుగు పుస్తకం / From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర కవుల చరిత్రము కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన పుస్తకము. ఇది మూడు భాగాలుగా వివిధ కాలాల్లో ముద్రించబడినది. ఇందులోని మొదటి భాగములో సుమారు 40 మంది ప్రాచీన తెలుగు కవుల గురించి విస్తృతంగా వివరించారు. రెండవభాగములో సుమారు 50-60 మంది మధ్యకాలపు తెలుగు కవుల జీవితచరిత్రలను చిత్రీకరించారు. మూడవ భాగములో సుమారు 140 మంది ఆధునికకాలపు తెలుగు కవుల జీవితాలను టూకీగా పేర్కొన్నారు. ఈ మూడింటిని హితకారిణీ సమాజము, రాజమండ్రి వారు ముద్రించారు. రచయిత తన మూడుభాగాలను పిఠాపురం మహారాజావారైన రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు గారికి అంకితమిచ్చారు.
త్వరిత వాస్తవాలు కృతికర్త:, అంకితం: ...
ఆంధ్ర కవుల చరిత్రము | |
కృతికర్త: | కందుకూరి వీరేశలింగం |
---|---|
అంకితం: | రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్ర |
ప్రచురణ: | హితకారిణి, రాజమండ్రి |
విడుదల: | 1917, 1940, 1950 |
మూసివేయి