కుద్రేముఖ్ జాతీయ వనం
From Wikipedia, the free encyclopedia
కుద్రేముఖ్ జాతీయ వనం కుద్రేముఖ్ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉన్నాయి. ఈ పర్వతాలను ఒక ప్రక్క నుండి చూస్తే అత్యంత ప్రకృతి రమణీయంగా గుఱ్ఱపు ముఖం ఆకారంగా కనిపించే కారణం చేత ఈ పర్వతాలకు కుద్రేముఖ్ అని పేరు వచ్చింది, కన్నడ భాషలో కుద్రే అనగా గుర్రం, ముఖ్ అనగా ముఖం. కార్కళకు 48 కి.మీ.లు, కలసకు 20 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల మీద ఒక చిన్న పట్టణం కూడా ఉంది. ఇక్కడ సమృద్ధిగా దొరికే ఉక్కు ముడిపదార్ధం వల్ల ప్రభుత్వం కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ అనే ఒక ఉక్కు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ కర్మాగారంలో పనిచేసేవారి నివాస స్థలం కొరకు ఇక్కడ ఒక చిన్న పట్టణ నిర్మాణం జరిగింది. దట్టమైన అడవుల మధ్య, వైవిధ్య వృక్ష-వన్యమృగ సంపద ఉన్న ఈ పర్వతశ్రేణులను చేరే రహదారి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. తుంగ, భద్ర, నేత్రావతి నదుల జన్మస్థానం ఈ పర్వతశ్రేణుల మధ్య ఉన్నదని చెబుతారు. 1.8 మీటర్ల ఎత్తు ఉన్న భాగవతి, వరాహ విగ్రహాలు ఉన్న గుహ పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తుంగ, భద్ర నదులు ఇక్కడ పారుతుంటాయి. కుద్రేముఖ్ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కదంబి జలపాతం చూసి తీరవలసిందే. ఇక్కడ కనిపించే వన్యమృగాలలో ముఖ్యమైనవి మలబార్ సివెట్, వేట కుక్కలు, స్లాత్ ఎలుగు బంటి, మచ్చలతో ఉన్న జింక.