భారత సైనిక దళం
From Wikipedia, the free encyclopedia
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం, భారతదేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకొంది.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |