వర్ధమాన మహావీరుడు
జైనమత సన్యాసి / From Wikipedia, the free encyclopedia
వర్ధమాన మహావీరుడు, జైనమతంను పునరుద్ధరించిన ఇరవై నాలుగవ తీర్థంకరుడు. పూర్వ వైదిక శకంలోని తీర్థంకరుల ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక బోధనలను ఆయన వివరించాడు. అతడు జైన సంప్రదాయంలో, సా.శ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలోని బీహార్ లోని క్షత్రియ కుటుంబంలో జన్మించినట్లు నమ్ముతారు. అతను 30 సంవత్సరాల వయస్సులో, ప్రపంచంలోని అన్ని వస్తువులను విడిచిపెట్టాడు, ఆధ్యాత్మిక మేల్కొలుపుతో ఒక సన్యాసిగా అయ్యాడు. ఆతడు 12 సంవత్సరాలపాటు తీవ్రమైన ధ్యానం, తీవ్ర తపస్సుల తరువాత అతను కెవాలా జ్ఞాన (సర్వవ్యాపకత్వం) సాధించి సా.శ.పూ. 6వ శతాబ్దం లో మోక్షాన్ని సాధించినట్లు జైనులు విశ్వసిస్తారు. అతడు 30 సంవత్సరాలు బోధించాడు, కార్ల్ పోటర్ వంటి పండితులు అతని జీవితచరిత్రను అస్పష్టంగా భావిస్తారు; కొంతమంది అతను గౌతమ బుద్ధతో సమకాలీనమైన వానిగా, సా.శ.పూ. 5వ శతాబ్దంలో నివసించినట్లు సూచిస్తున్నారు. మహావీరుడు 72 సంవత్సరాల వయస్సులో మోక్షం పొందాడు.
ఆధ్యాత్మిక విముక్తికి అహింస(అహింస), సత్యం(నిజం), అస్తేయ(దొంగతనం చేయకపోవటం), బ్రహ్మచర్య(పవిత్రత), ఆపరిగ్రహ(అనుబంధం లేకుండావుండడం) అవసరమని తెలిపాడు. అనేకతవాద, శ్యాదవాద, నయావాదా సూత్రాలను బోధించాడు. మహావీరుడి బోధనలను అతని ప్రధాన శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జైన ఆగమాల పేరుతో సంకలనం చేశాడు. జైన సన్యాసులచే వాచ్యంగా కొనసాగిన గ్రంథాలు, శ్వేతాంబర సంప్రదాయంలో సా.శ. 1వ శతాబ్దంలో తొలిగా లిఖించినప్పుడు చాలావరకు నశించాయని నమ్ముతారు. అలా వ్రాయబడినవి జైనమతం యొక్క పునాది గ్రంథాలయ్యాయి.
మహావీరుని చిత్రం పీఠ పక్కతలంపై సింహం చిహ్నంతో, పీఠంపై సాధారణంగా కూర్చున్న లేదా నిలబడ్డ ధ్యాన భంగిమలో వుంటుంది. వీటి తొలి రూపాలు ఉత్తర భారతదేశంలోని మధురలోని పురావస్తు ప్రాంతాలలో దొరికాయి. వీటిని సా.శ.పూ 1వ శతాబ్దం నుండి సా.శ.2వ శతాబ్దం కాలానికి చెందినవిగా గుర్తించారు. అతని పుట్టిన రోజును మహావీర్ జయంతిగా, నిర్యాణం(ముక్తి) పొందిన రోజును (ప్రధమ శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జ్ఞానోదయం పొందిన రోజు కూడా) జైనులు దీపావళిగా ఆచరిస్తారు.