అబ్దుల్ కలామ్ ద్వీపం
From Wikipedia, the free encyclopedia
అబ్దుల్ కలామ్ ద్వీపంఒడీషా తీరంలో గల ఒక ద్వీపం. భుబనేశ్వర్ నుండి 150 కి.మీ. దూరంలో, బాలేశ్వర్ (బాలసోర్) జిల్లాలో ఉంది ఈ ద్వీపం. గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవారు. క్షిపణులను పరీక్షించే ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఈ ద్వీపంలోనే ఉంది.
అబ్దుల్ కలామ్ ఐలాండ్ బంగాళాఖాతంలో ఒరిస్సా తీరం నుండి 10 కి.మీ. దూరంలో చాందీపూర్ కు దక్షిణంగా 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ ద్వీపం పొడవు 2 కి.మీ., వైశాల్యం 390 ఎకరాలు. సమీపంలోని నౌకాశ్రయం ధమ్రా. భారత్ తయారు చేసిన అనేక క్షిపణులకు పరీక్షా కేంద్రం అబ్దుల్ కలామ్ ఐలాండే; ఆకాశ్, అగ్ని, అస్త్ర, బ్రహ్మోస్. నిర్భయ్, ప్రహార్, పృథ్వి, శౌర్య, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, పృథ్వి ఎయిర్ డిఫెన్స్- వీటన్నిటినీ ఇక్కడే పరీక్షించారు. ఈ దీవికి చేరుకోవాలంటే ఓడమీదే వెళ్ళాలి. రోడ్డు గాని, రైలు మార్గం గానీ లేదు. చిన్న హెలిప్యాడ్ ఉంది. కానీ ఇక్కడికి రావలసిన సామానులు, ఇతర సరఫరాలూ ఓడల ద్వారానే వస్తాయి.[1]
2013 మేలో ఇసుక కోత కారణంగా, దీవి యొక్క రూపురేఖలు మారిపోవడం సమాజం దృష్టికి వచ్చింది. ఈ దీవి, రాయి మీద కాక ఇసుక తిన్నెల మీద ఉండడం చేత, ఇసుక చలనం కారణంగా ఈ కోత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం DRDO చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ సాయం కోరింది.[2]
2015 సెప్టెంబరులో వీలర్ ఐలాండ్ను మాజీ రాష్ట్రపతి గౌరవార్థం అబ్దుల్ కలామ్ ఐలాండ్ గా పేరు మార్చారు [3][4]