ఎండోమెట్రియోసిస్
ఎండోమెట్రియోసిస్ స్త్రీలను తీవ్రతరంగా ప్రభావితం చేసే గర్భాశయ వ్యాధి. / From Wikipedia, the free encyclopedia
ఎండోమెట్రియోసిస్ స్త్రీలను తీవ్రతరంగా ప్రభావితం చేసే గర్భాశయ వ్యాధి.
ఎండోమెట్రియోసిస్ అనేది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఇది మహిళల్లోను, కొంతవరకు క్షీరదాలలో సంభవిస్తుంది. ఎండోమెట్రియోసిస్ లో ఎండోమెట్రియం కణాలు, గర్భాశయం లోపలి భాగాన్ని కప్పి ఉంచే కణజాల పొర ఇంకా గర్భాశయం వెలుపల పెరుగుతాయి.[1][2] నెలసరి సమయం లో కొంతమంది మహిళలు భరించలేనంత నొప్పి తో బాధపడతారు. ఈ వ్యాధి కారణంగా సంతానలేమితో ఇబ్బంది పడతారు. గర్భాశయం లోపలి పొరను 'ఎండోమెట్రియం' అంటారు. నెలసరిలో ఈ పొర నుండే రక్తస్రావం అవుతుంది. అలాగే ఈ పొర వెలుపల కూడా ఒక కణజాలం ఉంటుంది. దీని నుంచి కూడా రక్తస్రావం జరగవచ్చు. అప్పుడు అక్కడ వాపు ఏర్పడి నొప్పి అనిపిస్తుంది. దీనిని ఎండోమెట్రియోసిస్ అంటారు. [3]
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 మిలియన్ల మహిళలు ఎండోమెట్రియోసిస్ బారిన పడుతున్నారు.[4] మహిళా జనాభాలో 6 - 10% మందికి ఎండోమెట్రియోసిస్ ఉండవచ్చని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.[5] ఇంకా ఈ వ్యాధి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మహిళలలో ఎక్కువగా కనుగొన్నారు.[6] ఎండోమెట్రియోసిస్ సామాజిక, మానసిక ప్రభావాలను కలిగి ఉంటుంది.[7]