కృష్ణ పూనియా
From Wikipedia, the free encyclopedia
కృష్ణ పూనియా (జననం 1977 మే 5) భారతీయ డిస్కస్ త్రోయర్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఆమె 2008, 2012 ఒలింపిక్ క్రీడలలో పాల్గొంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో, ఆమె బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె అంతర్జాతీయ స్వర్ణ పతక విజేత. భారతప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులతో ఆమెను సత్కరించింది.[2]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, జననం ...
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జననం | (1977-05-05) 1977 మే 5 (వయసు 47) ఆగ్రోహ, హర్యానా, భారతదేశం |
ఎత్తు | 1.8 m (5 ft 11 in)[1] |
బరువు | 79 kg (174 lb) (2013–ప్రస్తుతం) |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | అథ్లెటిక్స్ |
పోటీ(లు) | డిస్కస్ త్రో |
సాధించినవి, పతకాలు | |
వ్యక్తిగత అత్యుత్తమ(s) | 64.76 m (వైలుకు, హవాయి 2012) |
మూసివేయి
ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి రాజస్థాన్ లోని సాదుల్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[3][4][5] ఆమె ఫిబ్రవరి 2022లో రాజస్థాన్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా నియమితులయింది.[6]