గోవిందుడు అందరివాడేలే
2014 సినిమా / From Wikipedia, the free encyclopedia
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే".[1] ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు.[4][5] భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రకథను పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ రచించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకునిగా, నవీన్ నూలి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు, మీనా కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు స్ఫూర్తి.[6] ఈ సినిమా చిత్రీకరణ 2014 ఫిబ్రవరి 6న హైదరాబాదులో మొదలయ్యింది.[7] అదే రోజు మొదలైన ఈ సినిమా చిత్రీకరణ భారతదేశంలో హైదరాబాదు, రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచి, కన్యాకుమారి, కేరళ, కారైకుడి ప్రాంతాల్లో జరుపబడింది. విదేశాల్లో లండన్, జోర్డాన్ నగరాల్లో ఈ సినిమాలోని కొంత భాగం చిత్రీకరించబడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 అక్టోబరు 1న ఉదయం 5:18 గంటలకు విడుదలవుతోంది.[8]
గోవిందుడు అందరివాడేలే | |
---|---|
దర్శకత్వం | కృష్ణవంశీ |
రచన | పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ [1] |
నిర్మాత | బండ్ల గణేష్ |
తారాగణం | రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ, భానుశ్రీ మెహ్రా, ప్రకాశ్ రాజ్, జయసుధ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | నవీన్ నూలి[2] |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | అక్టోబర్ 1, 2014 |
సినిమా నిడివి | 149 నిమిషాలు[3] |
భాష | తెలుగు |