చాంద్ బీబీ
ఒక భారతీయ పాలకురాలు, యోధురాలు. ఆమె బీజాపూర్ సుల్తానేట్ కి, అహ్మద్నగర్ సుల్తానేట్కు కూడా రాజప / From Wikipedia, the free encyclopedia
సుల్తానా చాంద్ బీబీ (1550–1599 CE) ఒక భారతీయ పాలకురాలు, యోధురాలు. ఆమె 1580-1590లో రెండవ ఇబ్రహీం ఆదిల్ షా కు పిన్న వయసులో బీజాపూర్ సుల్తానేట్ కి రాజప్రతినిధి (రీజెంట్)గా వ్యవవహరించింది. 1595-1600లో ఆమె మేనల్లుడు బహదూర్ షా పిన్న వయసులో అహ్మద్నగర్ సుల్తానేట్కు కూడా రాజప్రతినిధిగా వ్యవహరించింది.[1] చాంద్ బీబీ 1595లో అక్బర్ చక్రవర్తి మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి అహ్మద్నగర్ను రక్షించడం వలన ప్రసిద్ధి చెందింది.[2]
త్వరిత వాస్తవాలు సుల్తానా చాంద్ బీబీ, జననం ...
మూసివేయి