ఢిల్లీ దర్బారు పతకం (1903)
బ్రిటిషు భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం ఇచ్చిన పత / From Wikipedia, the free encyclopedia
బ్రిటిషు పాలనలో ఉన్న భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్డమ్ నెలకొల్పిన పతకాలను ఢిల్లీ దర్బారు పతకాలు అంటారు. [1] వీటిని రెండు సందర్భాలలో - 1903 లో ఎడ్వర్డ్ VII రాజైనపుడు ఒకసారి, మళ్ళీ 1911 లో జార్జ్ V రాజైన సందర్భంలో రెండోసారి ఈ పతకాలను ప్రదానం చేసారు. ఇవి ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగి, బంగారు, వెండి రెండింటి తోనూ ప్రదానం చేసారు. [2] వీటిని ఎడమ ఛాతీపై పట్టాభిషేకం, జూబ్లీ పతకాలతో పాటు తేదీ క్రమంలో ధరిస్తారు. దీన్ని ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న రిబ్బనుకు తగిలిస్తారు. [3] ఈ రాయల్ స్మారక పతకాలు 1918 నవంబరు వరకు ప్రచార పతకాల కంటే ముందు ధరించారు. [4] ఆ తర్వాత ధరించే క్రమాన్ని మార్చి, ప్రచార పతకాల తర్వాత, సుదీర్ఘ సేవా పురస్కారాలకు ముందూ ఈ దర్బారు పతకాలను ధరించారు.
త్వరిత వాస్తవాలు Type, Awarded for ...
ఢిల్లీ దర్బారు పతకం, 1903 | |
---|---|
Type | స్మారక పతకం |
Awarded for | దర్బారులో కొలువు, లేదా భారత సామ్రాజ్యానికి విస్తృత సేవ |
దేశం | సంయుక్త రాజ్యం |
అందజేసినవారు | యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిషు రాజ్ |
Established | 1903 |
Total | 140 బంగారు, 2,567 వెండి పతకాలు |
మూసివేయి