నమీబియా
From Wikipedia, the free encyclopedia
అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నమీబియా అని పిలవబడే నమీబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. దీని పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో అంగోలా - జాంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బోత్సువానా - జింబాబ్వే దేశాలు ఉన్నాయి, దక్షిణ - తూర్పుసరిహద్దులను దక్షిణ ఆఫ్రికాతో పంచుకుంటుంది. ఇది నమీబియా స్వతంత్ర పోరాటం తర్వాత 1990 మార్చి 21న దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది. నమీబియా రాజధాని, అతిపెద్ద నగరం విండ్హక్ ఉంది.
రిపబ్లిక్ ఆఫ్ నమీబియా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Unity, Liberty, Justice" |
||||||
జాతీయగీతం "en:Namibia, Land of the Brave" |
||||||
[[బొమ్మ: |250px |center |నమీబియా యొక్క స్థానం]] | ||||||
రాజధాని అతి పెద్ద నగరం | Windhoek 22°34.2′S 17°5.167′E | |||||
అధికార భాషలు | English | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Afrikaans, German, Oshiwambo | |||||
ప్రజానామము | నమీబియన్ | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | హేగే జీంగోబ్ | ||||
- | ప్రధాన మంత్రి | Nahas Angula | ||||
Independence | from South Africa | |||||
- | Date | 1990 మార్చి 21 | ||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | 2009 అంచనా | 2,108,665[1] (142nd) | ||||
- | 2008 జన గణన | 2,088,669 | ||||
జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $13.771 billion[2] | ||||
- | తలసరి | $6,614[2] | ||||
జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $9.459 billion[2] | ||||
- | తలసరి | $4,543[2] | ||||
జినీ? (2003) | 70.7[1] (high) (1st) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.686 (medium) (128th) | |||||
కరెన్సీ | నమీబియా డాలర్ (NAD ) |
|||||
కాలాంశం | WAT (UTC+1) | |||||
- | వేసవి (DST) | WAST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .na | |||||
కాలింగ్ కోడ్ | ++264 |
నమీబియా ఐక్యరాజ్యసమితి, సదరన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ, ఆఫ్రికన్ యూనియన్, కామన్వెల్త్ ఆఫ్ నేషన్సు వంటి పలు అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. చాలా సంవత్సరాలకాలం దీనిని నైరుతి ఆఫ్రికాగా పిలిచేవారు. ఇక్కడ నమీబియా ఎడారి ఉన్న కారణంగా దేశానికి నమీబియా అనే పేరు వచ్చింది. ఇది ప్రపంచ దేశాలలోలో (మంగోలియా తర్వాత) రెండవ అత్యల్ప జనసాంద్రత గల దేశంగా పేరు గాంచింది.
నమీబియాలోని మెరక భూములలో ప్రారంభ సమయంలో బుష్మెన్, డమారా, నామాక్యూలు, బంటు ప్రజలు విస్తరణలో ప్రవేశించాయి. బంటు ప్రజలు ఈ భూభాగంలో సుమారు 14వ శతాబ్దం నుండి విస్తరించాయి. దీనిని 18వ శతాబ్దం చివరిలో బ్రిటీష్, డచ్ మిషనరీలు సందర్శించాయి. 1879లో డోర్స్లాండు ప్రయాణీకులు (వీరిని జంకరు బోయెర్సు) కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు.[3] కాని 1884లో ఒక జర్మనీ సామ్రాజ్యానికి చెందిన దేశంగా మారింది. 1920లో నానాజాతి సమితి ఈ దేశాన్ని దక్షిణ ఆఫ్రికాకు అప్పగించింది. తరువాత ఈ ప్రాంతంలో చట్టాలు అమలయ్యాయి. 1948 నుండి ఇక్కడ వర్ణవిచక్ష విధానం అమలులోకి అమలయ్యింది.
1966లో ఆఫ్రికా నేతల వ్యతిరేకతలు, అభ్యర్ధనల ఫలితంగా ఆ ప్రాంతం మీద ఐక్యరాజ్యసమితి ప్రత్యక్ష బాధ్యత వహించింది. 1973లో నమీబియా ప్రజల అధికారికంగా ప్రాతినిధ్యం వహించడానికి " సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ "ను నియమించారు. అయితే ఆ సమయంలో నమీబియా దక్షిణ ఆఫ్రికా పాలనలోనే ఉంది. అంతర్గత పోరాటం తర్వాత 1985లో నమీబియాలో దక్షిణ ఆఫ్రికా తాత్కాలిక పరిపాలనను స్థాపించింది. 1990లో దక్షిణ ఆఫ్రికా నుండి నమీబియా సంపూర్ణ స్వతంత్రాన్ని పొందింది. ఇందులో వాల్విస్ బేను మినహాయించింది. 1994 వరకు ఈ నగరం దక్షిణ ఆఫ్రికా పాలనలో ఉంది. 1990లో నైరుతి ఆఫ్రికా ఉన్న ఈ దేశం తన పేరును నమీబియాగా మార్చుకుంది.
నమీబియా జనసంఖ్య 2.1 మిలియన్లు. నమీబియాలో ఒక స్థిరమైన బహుళపార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. వ్యవసాయం, పశుపోషణ, పర్యాటక రంగం, విలువైన రత్నాలు, లోహాల త్రవ్వకం వంటి అంశాలు నమీబియా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా ఉంచుతున్నాయి. సుమారు జనాభాలో సగం మంది (ఒక రోజుకు $1.25 అమెరికా డాలర్లు) అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు.[4] 2007లో పురుషులలో 15% మందికి హెచ్.ఐ.వి. సోకింది. హెచ్.ఐ.వి. ప్రభావంతో దేశ జనాభా భారీగా దెబ్బతింది.[5]