బిపిన్ రావత్
భారత ఆర్మీ మాజీ చీఫ్ / From Wikipedia, the free encyclopedia
బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ (16 మార్చి 1958 - 8 డిసెంబర్ 2021)భారతీయ సైనిక అధికారి. జనవరి 2020 నుండి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా పనిచేశాడు.[2][3][4][5]ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది[2].[6]
బిపిన్ రావత్ | |||
బిపిన్ రావత్ | |||
1వ భారత త్రివిధ దళాల దళాధిపతి | |||
పదవీ కాలం 2020 జనవరి 1 (2020-01-01) – 8 డిసెంబరు 2021 (2021-12-08) | |||
రాష్ట్రపతి | రామ్నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నూతనంగా ఏర్పాటు చేశారు | ||
తరువాత | అనిల్ చౌహాన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1958-03-16)1958 మార్చి 16 ఉత్తరాఖండ్, పౌరీ జిల్లా ,భారతదేశం | ||
మరణం | 2021 డిసెంబరు 8(2021-12-08) (వయసు 63) కూనూర్, తమిళనాడు, భారతదేశం | ||
జాతీయత | భారతీయులు | ||
జీవిత భాగస్వామి | మధులిక రావత్[1] | ||
సంతానం | కృతిక, తారిణి | ||
పురస్కారాలు | *పరమ విశిష్ట సేవా పతకం
|
బిపిన్ రావత్ |ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో 16 మార్చి, 1958న జన్మించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో, లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. 1978 డిసెంబర్లో డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్లో చేరారు. డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్లో కమాండర్ ఇన్ చీఫ్గా నియమితులయ్యారు.