బూడిదవర్ణ పాత్రాసంస్కృతి
From Wikipedia, the free encyclopedia
బూడిదవర్ణ పాత్రాసంస్కృతి (పెయింటెడు గ్రే వేరు కల్చరు (పిజిడబ్ల్యు) ) అనేది పశ్చిమ గంగా మైదానం, భారత ఉపఖండంలోని ఘగ్గరు-హక్రా లోయ భారతీయ ఇనుప యుగం భారతీయ సంస్కృతి. ఇది సుమారుగా క్రీ.పూ 1200 నుండి క్రీ.పూ 600 వరకు ఉంటుంది. [1][2][3] ఇది ఈ ప్రాంతంలోని బ్లాకు అండు రెడ్ వేరు కల్చరు (బి.ఆర్.డబల్యూ) తరువాత సంస్కృతిగా భావించబడుతుంది. తూర్పు గంగా మైదానం, మధ్య భారతదేశంలో బి.ఆర్.డబల్యూ సంస్కృతికి సమకాలీనమైనది.[4]
నలుపు రంగులో రేఖాగణిత నమూనాలతో చిత్రీకరించబడిన చక్కటి, బూడిదవర్ణ కుండల శైలిగా వర్గీకరించబడింది.[5] పి.జి.డబల్యూ సంస్కృతి గ్రామ, పట్టణ స్థావరాలు, పెంపుడు గుర్రాలు, దంతపు కళ, ఇనుప లోహసాంకేతికత ఆగమనంతో సంబంధం కలిగి ఉంది.[6] ఇప్పటివరకు కనుగొనబడిన మొత్తం పి.జి.డబల్యూ ప్రాంతాలల సంఖ్య 1100 కంటే అధికం ఉన్నాయి. [7] చాలా పిజిడబ్ల్యు ప్రాంతాలు చిన్న వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ "అనేక డజన్ల" పిజిడబ్ల్యు ప్రాంతాలు పెద్ద స్థావరాలుగా ఉద్భవించాయి. వీటిని పట్టణాలుగా వర్గీకరించవచ్చు; వీటిలో అతి పెద్దది గుంటలు లేదా కందకాలు, చెక్క పాలిసేడ్లతో పోగు చేసిన భూమితో చేసిన కట్టలు క్రీ.పూ 600 తరువాత పెద్ద నగరాలలో ఉద్భవించిన విస్తృతమైన కోటల కంటే చిన్నవి, సరళమైనవి.[8]
పిజిడబ్ల్యు సంస్కృతి బహుశా మధ్య, చివరి వేద కాలానికి అనుగుణంగా ఉంటుంది. అంటే సింధు లోయ నాగరికత క్షీణించిన తరువాత భారత ఉపఖండంలో మొట్టమొదటి పెద్ద రాజ్యమైన కురు-పాంచాల రాజ్యం.[9][10] తరువాతి వేద సాహిత్యం ఆ కాలపు జీవితం, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ సంస్కృతి తరువాత క్రీ.పూ .700-500 నుండి ఉత్తర బ్లాక్ పాలిషు పాత్రాసంస్కృతి మొదలైంది. ఇది గొప్ప మహాజనపద రాజ్యాలు, మగధ సామ్రాజ్యం పెరుగుదలతో సంబంధం కలిగి ఉంది.