మహాత్మా గాంధీ హత్య
From Wikipedia, the free encyclopedia
మోహన్దాస్ కరంచంద్ గాంధీ, (మహాత్మా గాంధీగా సుప్రసిద్ధులు) జనవరి 30 1948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు.[1]
త్వరిత వాస్తవాలు మహాత్మాగాంధీ హత్య, ప్రదేశం ...
మహాత్మాగాంధీ హత్య | |
---|---|
ప్రదేశం | న్యూఢిల్లీ |
తేదీ | 30 జనవరి 1948 17:17 (భారత ప్రామాణిక సమయం) |
లక్ష్యం | మోహన్దాస్ కరం చంద్ గాంధీ |
ఆయుధాలు | బెరెట్టా ఎం 1934 సెమి-ఆటోమేటిక్ పిస్టల్ |
మరణాలు | 1 (గాంధీజీ) |
నేరస్తుడు | నాథూరాం గాడ్సే |
మూసివేయి
ఆయన మరణానికి ముందు గాంధీజీని హత్యచేయుటకు ఐదుసార్లు ప్రయత్నాలు జరిగినవి. మొదటిసారి 1934లో హత్యాప్రయత్నం జరిగింది.