రాబర్ట్ హుక్
From Wikipedia, the free encyclopedia
రాబర్ట్ హుక్ (1635 జులై 18 - 1703 మార్చి 3)[4] ఒక ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు, ఆర్కిటెక్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన సూక్ష్మదర్శినిని (Microscope) ఉపయోగించి సూక్ష్మక్రిములను (micro-organism) మొదటిసారిగా దర్శించగలిగాడు.[5] ఈయన యవ్వనంలో పేదవాడిగా ఉన్నా 1666 లో లండన్ లో సంభవించిన పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత చేపట్టిన ఆర్కిటెక్చరల్ సర్వేలో సుమారు సగభాగానికి పైగా పాల్గొని ధనవంతుడయ్యాడు. రాయల్ సొసైటీలో కూడా సభ్యుడయ్యాడు. 1662 నుంచి అక్కడ జరిగే పరిశోధనలను పర్యవేక్షించేవాడు. గ్రేషాం కాలేజీలో క్షేత్ర గణిత విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడు.
భౌతిక శాస్త్రవేత్త అయిన రాబర్ట్ బాయిల్ కి సహాయకుడిగా ఉంటూ ఆయన వాయువు ధర్మాలను కనిపెట్టడానికి చేసిన పరిశోధనల కోసం వాక్యూం పంప్ తయారు చేశాడు. ఆయన కూడా స్వయంగా ప్రయోగాలు చేశాడు. 1673 లో తొలిసారిగా గ్రెగొరియన్ టెలిస్కోపు తయారు చేసి అంగారక గ్రహం, గురు గ్రహం పరిభ్రమణాల్ని గమనించాడు. 1665 లో ఈయన రాసిన మైక్రోగ్రాఫియా అనే పుస్తకం సూక్ష్మపరిశీలనకు నాంది పలికింది.[5]