వందన శివ
From Wikipedia, the free encyclopedia
వందన శివ (జననం 1952 నవంబరు 5) భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త, ఆహార సార్వభౌమత్వ సమర్థకురాలు, ప్రపంచీకరణ వ్యతిరేకి, రచయిత్రి.[2] ఆమె ఇరవైకి పైగా పుస్తకాలను రచించింది.[3] ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభలో (జెర్రీ మాండర్, రాల్ఫ్ నాడర్, జెరెమీ రిఫ్కిన్లు సహసభ్యులుగా గల ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ గ్లోబలైజేషన్) ఒక నాయకురాలిగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి.[4] రాంచర్ ప్రైమ్ రాసిన వేద ఎకాలజీ పుస్తకం కొరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక సాంప్రదాయ పద్ధతులకు అనుకూలంగా వాదించింది. 1993 లో సరియైన జీవనోపాధి (రైట్ లైవ్లీహుడ్) పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీడిష్-జర్మన్ పరోపకారి జాకోబ్ వాన్ యుక్స్కుల్ స్థాపించాడు. దీనిని "ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి"గా పరిగణిస్తారు.[5][6]
త్వరిత వాస్తవాలు వందన శివ, జననం ...
వందన శివ | |
---|---|
జననం | (1952-11-05) 1952 నవంబరు 5 (వయసు 71) డెహ్రాడూన్, ఉత్తర ప్రదేశ్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ ), భారతదేశం |
జాతీయత | భారతీయులు |
విద్యాసంస్థ | పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్ గూఎల్ఫ్ విశ్వవిద్యాలయం వెస్టర్న్ ఓంటారియో విశ్వవిద్యాలయం |
వృత్తి | తత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, రచయిత్రి, వక్త, సామాజిక ఉద్యమకారిణి |
పురస్కారాలు | రైట్ లైవ్లీ హుడ్ పురస్కారం (1993) సిడ్నీ పీస్ ప్రైజ్ (2010) మిరోదీ పురస్కారం (2016) ఫుకుయోకా ఆసియన్ కల్చర్ ప్రైజ్ (2012) |
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి.
|
మూసివేయి