సాత్నా
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
సాత్నా మధ్యప్రదేశ్ రాష్ట్రం, సత్నా జిల్లా లోని నగరం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. సత్నా జిల్లా బగేల్ఖండ్ ప్రాంతంలో భాగం. దీనిలో ఎక్కువ భాగం రీవా పాలనలో ఉండేది. సత్నాలో కొంత భాగాన్ని భూస్వామ్య ప్రభువులు పాలించారు, వారి రాజ్యాలను బ్రిటిష్ రాజ్ కింద ఉంచారు.
సాత్నా | |
---|---|
సాత్నా | |
Coordinates: 24.6005°N 80.8322°E / 24.6005; 80.8322 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | సత్నా |
Area | |
• నగరం | 71 km2 (27 sq mi) |
• Metro | 111 km2 (43 sq mi) |
Elevation | 315 మీ (1,033 అ.) |
Population (2011)[2] | |
• నగరం | 2,80,222 |
• Rank | 8th (in state) |
• Density | 3,900/km2 (10,000/sq mi) |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 485001 |
టెలిఫోన్ కోడ్ | (+91) 07672 |
Vehicle registration | MP-19 |
అధికారిక | హిందీ[3] |
పట్టణం పేరు సత్నా నది మీదుగా వచ్చింది. ఇది పన్నా జిల్లాలోని సారంగ్పూర్ గ్రామానికి సమీపంలో ఉన్న సారంగ్ ఆశ్రమం (సుతీక్ష్ణ ఆశ్రమం) వద్ద ఉద్భవించింది. గతంలో, సత్నా రైల్వే స్టేషను, రఘురాజ్ నగర్ అనే పట్టణానికి చెందినదిగా ఉండేది. క్రమంగా ఈ స్టేషను పేరే పట్టణానికి కూడా వచ్చింది.
1872 లో బ్రిటిష్ వారు సత్నాలో బగేల్ఖండ్ ఏజెన్సీని స్థాపించారు దీన్ని 1931 లో రద్దు చేసారు. కల్నల్. DWK బార్ 1882–88 సంవత్సరాలలో సత్నాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశాడు. సర్ డోనాల్డ్ రాబర్ట్సన్ 1888–94లో ఆ ప్రణాళికల ప్రకారం రోడ్లు, ఇతర సౌకర్యాల నిర్మాణాలు కావించాడు.