సిద్ధార్థ జాదవ్
From Wikipedia, the free encyclopedia
సిద్ధార్థ రామచంద్ర జాదవ్ (జననం 1981 అక్టోబర్ 23) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు. అతను టెలివిజన్, మరాఠీ, హిందీ చిత్రాలలో నటించాడు. గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలలో నటించాడు. జాదవ్ మిథున్ చక్రవర్తి హీరోగా అమీ సుభాష్ బోల్చి అనే బెంగాలీ సినిమాలో కూడా నటించాడు. మీడియాలో ఇతని గురించి "మరాఠీ సినిమా కామెడీ కింగ్"గా ప్రస్తావించబడింది.[3]