వర్గం:హిందూమతం
From Wikipedia, the free encyclopedia
హిందూ మతం ఏ వ్యక్తి,వ్యక్తుల ఆలోచనలతో ఏర్పడలేదు. ఉత్తరభారతదేశంలో ప్రవహిస్తున్న "సింధూ నది' ని దాటి భారతదేశంలో ప్రవేశించిన విదేశీయులు ఇక్కడి మానవ ఆచారవ్యవహారాలు, వైదికకర్మలు, దేవతలు, ఆరాధనలను పరిశీలించి మొదట వీరిని "సింధువులు' అని పిలిచే వారు. సింధువుల ఆచారవ్యవహారాలను, దేవతారాధనలను "సింధూమతంగా పరిగణించారు. పరసీకుల రాజు పరిపాలిస్తున్న కాలంలో, వారి అద్వర్యంలో అప్పటి సింధు ప్రాంతపువారిని పిలవడానికి సింధు అనే పదానికి బదులు హిందు అనే పదాన్ని వాడటం జరిగింది. ఎందుకనంటే వారి భాషలొ " స " తో మొదలయ్యే పదమే లేదు. వారు ఆ పదాన్ని పలుకరు. " స " తో మొదలయ్యే పదానికి బదులుగా " హ " అనే పదాన్ని వారు ఉచ్చరించేవారు. దాని ప్రకారం " సింధు నాగరికతను " " హిందు నాగరికతాగా" పిలవబడింది. కాలక్రమములో సింధూ మతమే "హిందూమతం" అని ప్రాచుర్యం పొందింది. (మహామహాపోధ్యాయ)
ఈ మతంలోని పెద్దలు, సంప్రదాయవాదులు "హిందు" పదానికి బదులు "సనాతనం" "సనాతన ధర్మం" "సనాతన మతం" అనే పదాలను ఉపయోగిస్తారు. నిజానికి విదేశీయులచే ఇవ్వబడిన హిందు పేరు కంటే సనాతనం అనే పేరు ఉత్తమం అనే వాదన కూడా పలువురు వినిపిస్తారు.