కొవ్వూరు
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన పట్టణం,ఇది మండలకేంద్రం. ఇది గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక నేపథ్యంగల ఊరు. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.
ఈ వ్యాసం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండల పట్టణం గురించి. కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం కొరకు, కొవ్వూరు (కాకినాడ గ్రామీణ మండలం) చూడండి.
త్వరిత వాస్తవాలు కొవ్వూరు, దేశం ...
పట్టణం | |
Coordinates: 17.02°N 81.73°E / 17.02; 81.73 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండలం | కొవ్వూరు మండలం |
Area | |
• మొత్తం | 24.56 km2 (9.48 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 39,667 |
• Density | 1,600/km2 (4,200/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1061 |
Area code | +91 ( 8813 ) |
పిన్(PIN) | 534350 |
Website |
మూసివేయి