కురుక్షేత్ర సంగ్రామం
From Wikipedia, the free encyclopedia
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.
కురుక్షేత్ర సంగ్రామం | |||||||
---|---|---|---|---|---|---|---|
| |||||||
ప్రత్యర్థులు | |||||||
పాండవులు - సైన్యాధిపతి- దృష్టద్యుమ్నుడు | కౌరవులు - సైన్యాధిపతి - భీష్ముడు | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
అర్జునుడు భీముడు యుధిష్ఠిరుడు నకులుడు సహదేవుడు | భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ | ||||||
బలం | |||||||
7 అక్షౌహిణులు 1,530,900 సైనికులు | 11 అక్షౌహిణులు 2,405,700 సైనికులు | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
దాదాపు మొత్తం కేవలం 8 మంది బ్రతికారు - ఐదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు | దాదాపు మొత్తం కేవలం ముగ్గురు బ్రతికారు - అశ్వత్థామ, కృప, , కృతవర్మ |
కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.