తులసీదాసు
కవి మరియు హిందీ భాషలో రామాయణాన్ని రచించారు / From Wikipedia, the free encyclopedia
గోస్వామి తులసీదాసు[3][ 1497/1532[1] - 1623 ] గొప్ప కవి . అతను ఉత్తర ప్రదేశ్ లోని రాజపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించాడు . తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు . హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు[4][5][6][7]. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, సమాజంలో విశేష ప్రభావం చూపాయి. దీని కారణంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు అనేకం విలసిల్లాయి.[8][9][10][11][12][13]. ఈయన శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి[14]. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా రచించాడు. విశేషం ఏమిటంటే ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతటా ఏ ప్రాంత, ఏ రాష్ట్రప్రజలైనా కూడా "హనుమాన్ చాలీసా"ను అన్ని భాషలవారూ పరమభక్తితో పఠిస్తారు ! అంతనమ్మకం ఉన్నది ఈ రచనమీద.
గోస్వామి తులసీదాసు | |
---|---|
జననం | రాంబోలా 1497 లేదా 1532[1], CV. వాళ్లు . , Z. , , , ,. , ,,. రాజపూర్, ఉత్తరప్రదేశ్ (ప్రస్తుతం చిత్రకోట్ జిల్లా) |
నిర్యాణము | 1623 అస్సీ ఘాట్, వారణాశి (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ) |
బిరుదులు/గౌరవాలు | గోస్వామి, అభినవ వాల్మీకి, భక్తశిరోమణి, మొదలగునవి |
గురువు | నరహరిదాసు . |
తత్వం | వైష్ణవ మతం |
సాహిత్య రచనలు | రామచరిత మానస్, వినయపత్రిక, దోహావళి, కవితావళి, హనుమాన్ చాలీసా, వైరాగ్య సందీపని, జానకీ మంగళ్, పార్వతీ మంగళ్ మొదలైనవి. |
ఉల్లేఖన | I సీతా రాముల నుండి పుట్టినట్లు భావించి, రెండు చేతులతో మొత్తం ప్రపంచానికి నమస్కరించండి.[2] |