నల్లమల అడవులు
From Wikipedia, the free encyclopedia
నల్లమల (ఆంగ్లం : The Nallamala) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.[1]. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.[2]. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
నల్లమల కొండలు | |
నల్లమల | |
విస్తృతి | |
బొగడ దగ్గరలోని నల్లమల . దొరబావి ఆకృతుల అవశేషాలను కూడా చూడవచ్చు. | |
దేశం | భారతదేశం |
---|---|
Provinces/States | ఆంధ్ర ప్రదేశ్ |
Highest point | భైరానీ కొండ (శిఖరేశ్వరం) |
- ఎత్తు | 3,047 ft (929 m) |
- ఆక్షాంశరేఖాంశాలు | 15°40′41″N 78°47′10″E |
పొడవు | 90 mi (144.84 km), ఉత్తర-దక్షిణ |
Period | ప్రోటోజోయిక్ |