మహానంది
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, మహానంది మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది మహానంది మండలానికి కేంద్రం.నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది.[1]ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది.ఈ పురాతన ఆలయం సా.శ. 7 శతాబ్దం నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాలు ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మత్తులు జరిగినట్లుగా, పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి.[2]
త్వరిత వాస్తవాలు మహానందీశ్వరాలయం, మహానంది, భౌగోళికం ...
మహానందీశ్వరాలయం, మహానంది | |
---|---|
మహానంది | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 15°28′14″N 78°37′34″E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
ప్రదేశం | నంద్యాల |
సంస్కృతి | |
దైవం | శివుడు |
ముఖ్యమైన పర్వాలు | మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ |
మూసివేయి