రామన్ మెగసెసే పురస్కారం
From Wikipedia, the free encyclopedia
రామన్ మెగసెసే పురస్కారం, న్యూయార్క్ కు చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది.[1][2][3] ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది.
త్వరిత వాస్తవాలు రామన్ మెగసెసే పురస్కారం, వివరణ ...
రామన్ మెగసెసే పురస్కారం | |
---|---|
వివరణ | ప్రభుత్వ సేవలో అత్యుత్తమ రచనలు, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, సాహిత్యం , క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, శాంతి, అంతర్జాతీయ అవగాహన, అత్యవసర నాయకత్వం |
దేశం | ఫిలిప్పీన్స్ |
అందజేసినవారు | రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ |
మొదటి బహుమతి | 1958 |
వెబ్సైట్ | http://www.rmaf.org.ph |
మూసివేయి
ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.
- ప్రభుత్వ సేవ
- ప్రజా సేవ
- సామాజిక నాయకత్వం
- జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
- ప్రపంచ శాంతి
- అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు