శృంగేరి
From Wikipedia, the free encyclopedia
శృంగేరి (కన్నడ: ಶೃಂಗೇರಿ), కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి [1] పాలిస్తున్న అంగ రాజ్యంలో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.
?శృంగేరి కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13.42°N 75.25°E / 13.42; 75.25 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 672 మీ (2,205 అడుగులు) |
జిల్లా (లు) | చిక్మగులూరు జిల్లా జిల్లా |
శాసనసభ సభ్యుడు | డి.ఎన్.జీవరాజ్ |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 577139 • +08265 • KA-18 |