మథుర
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ఆగ్రాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలో ఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణుని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.
జిల్లా (లు) | మథుర జిల్లా |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 281 XXX • +91(565) • UP-85 |
వెబ్సైటు: mathura.nic.in/ |
మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే సా.శ. మొదటి శతాబ్దంలో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారం తయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.
షెర్లాక్ హోమ్స్ రచించిన ది సైన్ ఆఫ్ ఫోర్ నవలలో మథురా నగర వర్ణన ఉంది.