సావిత్రి (నటి)
సుప్రసిద్ధ సినీ నటి (మహా నటి) / From Wikipedia, the free encyclopedia
నిశ్శంకర సావిత్రి (డిసెంబర్ 6, 1936 - డిసెంబర్ 26, 1981) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.
సావిత్రి | |
---|---|
జననం | నిస్శంకర సావిత్రి (1935-12-06)1935 డిసెంబరు 6 [lower-alpha 1] చిరవూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారతదేశం) |
మరణం | 1981 డిసెంబరు 26(1981-12-26) (వయసు 46) చెన్నై, తమిళనాడు, భారతదేశం |
ఇతర పేర్లు | మహానటి సావిత్రి నడిగైయర్ తిలగం |
వృత్తి | నటి, గాయని, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
పురస్కారాలు | రాష్ట్రపతి అవార్డు నంది అవార్డు కళైమామణి |