ఇందిరా గాంధీ
భారత దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి / From Wikipedia, the free encyclopedia
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.[1]
ఇందిరా గాంధీ | |||
భారతదేశపు ప్రధమ మహిళా ప్రధాన మంత్రి | |||
పదవీ కాలం 14 జనవరి 1980 – 31 అక్టోబరు 1984 | |||
రాష్ట్రపతి | నీలం సంజీవరెడ్డి జ్ఞాని జైల్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | చౌదరి చరణ్ సింగ్ | ||
తరువాత | రాజీవ్ గాంధీ | ||
పదవీ కాలం 24 జనవరి 1966 – 24 మార్చి 1977 | |||
అధ్యక్షుడు | సర్వేపల్లి రాధాకృష్ణన్ డా.జాకిర్ హుసేన్ వి.వి.గిరి ఫకృద్దీన్ అలీ అహ్మద్ | ||
ముందు | గుల్జారీలాల్ నందా | ||
తరువాత | మొరార్జీ దేశాయ్ | ||
కేంద్ర విదేశంగా శాఖా మంత్రి | |||
పదవీ కాలం 9 మార్చి 1984 – 31 అక్టోబరు 1984 | |||
ముందు | పి.వి.నరసింహారావు | ||
తరువాత | రాజీవ్ గాంధీ | ||
పదవీ కాలం 22 ఆగస్టు 1967 – 14 మార్చి 1969 | |||
ముందు | మహమ్మదాలీ కరీం చగ్లా | ||
తరువాత | దినేష్ సింగ్ | ||
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి | |||
పదవీ కాలం 26 జూన్ 1970 – 29 ఏప్రిల్ 1971 | |||
ముందు | మొరార్జీ దేశాయ్ | ||
తరువాత | యశ్వంతరావు చవాన్ | ||
పదవీ కాలం 1959 | |||
ముందు | యు.ఎన్.దేబర్ | ||
తరువాత | నీలం సంజీవరెడ్డి | ||
పదవీ కాలం 1978–1984 | |||
ముందు | దేవ్ కాంత్ బారువా | ||
తరువాత | రాజీవ్ గాంధీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1917-11-19)1917 నవంబరు 19 అలహాబాదు, సమైక్య ఆస్థానములు, బ్రిటీషు ఇండియా | ||
మరణం | 1984 అక్టోబరు 31(1984-10-31) (వయసు 66) న్యూ ఢిల్లీ, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఫిరోజ్ గాంధీ | ||
సంతానం | రాజీవ్ గాంధీ , సంజయ్ గాంధీ | ||
మతం | హిందూమతము-ఆది ధర్మం | ||
సంతకం |
మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సంప్రదాయానికి అలవాటు పడినవారు.
ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్లో జరిపిన మారణకాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.
ఇలాంటి తరుణంలో మోహన్దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.
చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.