తాజ్ మహల్
భారత దేశంలోని ఆగ్రా లో ఒక అత్యద్భుతం / From Wikipedia, the free encyclopedia
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal (/ˈtɑːdʒ məˈhɑːl/)[2] (హిందీ: ताज महल)[3][4] (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.
తాజ్ మహల్ Taj Mahal تاج محل ताज महल | |
---|---|
ప్రదేశం | ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారత దేశము |
భౌగోళికాంశాలు | 27°10′30″N 78°02′31″E |
ఎత్తు | 73 మీ (240 అడుగులు) |
నిర్మాణము | 1632–1653[1] |
వాస్తు శిల్పి | ఉస్తాద్ అహ్మద్ లాహోరి |
నిర్మాణ శైలి | మొఘల్ నిర్మాణ శైలి |
సందర్శన | 30 లక్షలకు పైగా (in 2003) |
రకం | సాంస్కృతిక |
ప్రమాణం | i |
నియామకం | 1983 (7th session) |
సూచిక సంఖ్య | 252 |
దేశం | భారత దేశము |
ప్రాంతం | ఆసియా-పసిఫిక్ |
తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.[5][6] 1983వ సంవత్సరంలో తాజ్ మహల్ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది."
తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది, వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు.[7] తాజ్ మహల్ నిర్మాణం అబ్దుల్-కరీం మాముర్ ఖాన్, మక్రమత్ ఖాన్, ఉస్తాద్ అహ్మద్ లాహూరి మొదలైన నిర్మాణ శిల్పుల మండలి యొక్క సార్వభౌమ్య పర్యవేక్షణలో జరిగింది.[8][9] సాధారణంగా లాహూరి ప్రధాన రూప శిల్పిగా ఎంచబడ్డాడు.[10]