తైత్తిరీయోపనిషత్తు
From Wikipedia, the free encyclopedia
తైత్తిరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తులలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
తైత్తరీయోపనిషత్తు అయిదు ప్రశ్నములు (భాగాలు) గా అధ్యాపక ప్రసిద్ధము. అవి
- శిక్షాప్రశ్నము లేక శిక్షావల్లి
- బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి
- భృగువల్లి
- నారాయణప్రశ్నము
- చిత్తిప్రశ్నము
వీటిలో చిత్తి ప్రశ్నము బ్రహ్మవిద్యాప్రతిపాదకము కానందు వల్ల దీనికి ప్రాచుర్యము లేదు.
ఈ తైత్తిరీయోపనిషత్తు ఆంధ్ర పాఠము, ద్రావిడ పాఠము అని రిండు విధములుగా ఉంది.ద్రావిడపాఠాన్ని శ్రివైష్ణవులు పఠిస్తారు.ఆంధ్రపాఠాన్ని వింధ్యకు దక్షిణానగల బ్రాహ్మణులు పఠిస్తారు. ద్రావిడపాఠములో లేని కొన్ని మంత్రములు ఆంధ్ర పాఠములో ఉండడంచేత ఆంధ్రపాఠమే హెచ్చు ప్రాచుర్యంలో ఉంది. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి ప్రశ్నములకు శంకరభగవత్పాదుల భాష్యము, విద్యారణ్యుల బృహద్వివరణము, సురేశ్వరాచార్యుల భాష్యవార్తికము మొదలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నారాయణ ప్రశ్నమునకు భట్టభాస్కరభాష్యము, సాయనాచార్యుల భాష్యములు ఉన్నాయి. వీటిలో ఆంధ్రపాఠాన్ని అనుసరించి సాయన భాష్యము ఉంటే, ద్రావిడపాఠాన్ని భట్టభాస్కరభాష్యము అనుసరించింది.
తైత్తిరీయోపనిషత్తులో మొత్తం 112 అనువాకాలు ఉన్నాయి. వీటిలో శిక్షావల్లిలో 12, బ్రహ్మవల్లిలో 10, భృగువల్లిలో 10, నారాయణప్రశ్నములో 80 అనువాకాలు ఉన్నాయి.
ప్రతి అనువాకం మంత్రాల సముదాయం.